ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్రంలో 1000 మీ మార్ట్లు ఏర్పాటు చేయనుంది.

అక్టోబర్ 1వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. 

ఇప్పటివరకు 970 షాపులు సిద్ధమయ్యాయని, మరో 130 షాపులను కూడా వేగంగా పూర్తి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 

డీమార్ట్లకు పోటీగా.. అదే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మీ మార్టులను తెస్తున్నామన్నారు. 

వీటి ద్వారా తొలుత 64 రకాల సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి వివరించారు.