అమరావతి 8వ కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం...
మనకు ఉన్న అవకాశాలను అన్ లాక్ చేయగలిగాం. ప్రతీ శాఖలోనూ సంస్కరణలు తీసుకువచ్చాం.
• గత ప్రభుత్వం నిర్వాకంతో మార్కెట్టులోకి వచ్చిన జే బ్రాండ్ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారు. వారి ఆరోగ్యం కూడా దెబ్బతింది.
• కల్తీ బ్రాండ్లన్నీ రద్దు చేసి పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూస్తున్నాం.
• విద్యుత్ టారిఫ్ పెంచకుండా... నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేస్తున్నాం.
• ప్రతీ నెలా ఆర్దిక నివేదికను విడుదల చేసి ఎప్పటికప్పుడు లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నాం.
• ప్రతీ మూడు నెలలకూ జీఎస్డీపీని కూడా లెక్కించి ప్రగతిలో ఎక్కడ ఉన్నామో చూస్తున్నాం.
• 2022-23 బేస్ ఇయర్ గా ప్రస్తుత ధరలకు అనుగుణంగా 13.44 శాతం వృద్ధి రేటు నమోదైంది.
• తయారీ రంగంలోనూ అభివృద్ధి నమోదు అయ్యింది.
• జీఎస్టీ కలెక్షన్స్ కూడా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.25,450 కోట్ల మేర పెరిగింది.
• మనకు వనరులు ఉన్నాయి. టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ కొన్ని చోట్ల లీడర్షిప్ లోపం ఉంది.
• ఉద్యోగుల సామర్ధ్యం పెంపు కోసం వివిధ కోర్సులు కూడా నిర్వహిస్తున్నాం.
• ఇప్పటి వరకూ 1.50 కోట్ల కోర్సులను సామర్ధ్యాలను పెంచేందుకు నిర్వహించాం.
• డీప్ టెక్ గవర్నెన్సు ఉంటే అనూహ్యమైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంది.
• టెక్నాలజీని వినియోగించడం ద్వారా డేటా లేక్, అవేర్ లాంటి వ్యవస్థలతో నిర్ణయాల్లో వేగం పెరగాలి... సేవల్లో నాణ్యత పెంచాలి.
• గతంలో 50 ఏళ్లలో చేసే అభివృద్ధిని ఇప్పుడు 10-15 ఏళ్లలోనే సాధించేందుకు ఆస్కారం ఉంది.
• రియాక్టివ్ గవర్నెన్సు కంటే ప్రో యాక్టివ్ గవర్నెన్సు ఉండాలి.
• ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయంటే అంటే అభివృద్ధి-పాలన పెండింగ్ లో ఉన్నట్టే.
• ప్రభుత్వ సేవలు సక్రమంగా అందినప్పుడే ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంటుంది.
• ఈ ఏడాది తీవ్రమైన ఎల్ నినో కారణంగా నీటి భద్రత ఓ సవాలుగా మారింది.
• 54 శాతం లోటు వర్షపాతం ఈసారి రాష్ట్రంలో నమోదైంది
