రైలు ఢీకొని వ్యక్తి మృతి.
తిరుపతి-రేణిగుంట రైల్వే మార్గంలోని చింతల చేను వద్ద గల KM. No 91/17-19 అప్ప్లైన్ రైల్వే ట్రాక్ మధ్య జరిగిన ఘటన.
గుర్తు తెలియని మగ వ్యక్తి వయసు సుమారు 35 -40 సంవత్సరాలు ఉండవచ్చు రైల్వే పోలీసుల అంచనా.
ట్రాక్ మధ్యలో పడి ఉన్నట్లు రైల్వే ట్రాక్ కీ మాన్ ఏ తాతయ్య ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులకు డిప్యూటీ SS సంగీత లక్ష్మి డెత్ మెసేజ్.
రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన.
మృతుడి తల పగిలి గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నట్లు గుర్తింపు.
మృతుడి శరీరంపై బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ తప్ప మృతుని వద్ద ఎలాంటి ఆచూకీ లభించని వైనం.
మృతదేహాన్ని ఎస్వి మెడికల్ కాలేజ్ మార్చురీకి తరలింపు.
ఎవరైనా మృతదేహాన్ని గుర్తించిన ఎడల తిరుపతి రైల్వే పోలీసులను సంప్రదించండి.
